బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది: జగదీష్ రెడ్డి

by Disha Web Desk 2 |
బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది: జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని మోసపూరిత బడ్జెట్ ఇది అని అన్నారు. గృహజ్యోతిపై నిర్దిష్ట బడ్జెట్ లేదని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రూపం బయటపడిందని అన్నారు. అలీబాబా 40 దొంగల్లాగా సీఎం రేవంత్ రెడ్డి బ్యాచ్ ఉన్నారని తెలిపారు. కేఆర్ఎం‌బీలో సంతకాలు చేసి దొరికిపోయారని ఎద్దేవా చేశారు. 2 నెలలుగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల స్వాధీనం కోసం ప్రయత్నాలు చేయలేదని అన్నారు.

రాష్ట్ర హక్కులు కాపాడటం కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయడానికి తాము సిద్ధమని జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడే కాదు.. ఢిల్లీకి వెళ్లి అయినా తమ పోరాటం చేస్తామని అన్నారు. ఆరునూరైనా నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని అన్నారు. తెలంగాణ రైతాంగ హక్కుల సాధనకు పేగులు తెగే దాకా కొట్లాడుతామని అన్నారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి లాంటి వాళ్లు మాకు లెక్క కాదన్నారు. ఇంతకంటే పెద్ద పెద్ద వాళ్లతోనే కొట్లాడామని తెలిపారు.

Next Story