కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది: Etela

by GSrikanth |   (  Updated:2022-12-09 06:32:05  IST  )

బీఆర్ఎస్ ఏర్పాటుపై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది: Etela
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఏర్పాటుపై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పదాన్ని రద్దు చేసుకొని బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న మరుక్షణమే, కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెంటిమెంట్‌ను ప్రజలు తప్పక తిప్పికొడతారని మండిపడ్డారు.

Read More....

MLA Rajasingh పై మరో కేసు నమోదు

Next Story