భారత్‌లో కేసీఆర్ ఇజం రావాలి: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

by Disha Web Desk 19 |
భారత్‌లో కేసీఆర్ ఇజం రావాలి: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అవగాహన లేదని, తెలంగాణపై సోయి పెంచుకోవాలని సూచించారు. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతలకు చిత్త శుద్ధి లేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో ధరలు, మతోన్మాదం బాగా పెరిగాయన్నారు.

ప్రజల అవసరాలు తీర్చడమే బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత అని, కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదన్నారు. దేశంలో రాక్షస పాలన కొనసాగుతుందని, హామీలు నెరవేర్చుకునే పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. మోడీది జాతీయవాదం కాదు.. మోడీ వాదం అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కేసీఆర్ నేర వేరుస్తున్నారని తెలిపారు. దేశంలో కేసీఆర్ ఇజం రావాలి అని పేర్కొన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే మిషన్ భగీరథ పెండింగ్ నిధులు తెచ్చి మాట్లాడాలని హితవు పలికారు.

Next Story

Most Viewed