'ఎమ్మెల్యే భాస్కర్ రావు అయ్య జాగిరా'

by Disha Web Desk 4 |
ఎమ్మెల్యే భాస్కర్ రావు అయ్య జాగిరా
X

దిశ, డైనమిక్ బ్యూరో : తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కేసీఆర్ ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దంటూ అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఇందిరా శోభన్ ఫైర్ అయ్యారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారంటూ నర్సాపూర్ గ్రామస్తులపై భాస్కర్ రావు మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కేసీఆర్ వేయించిన రోడ్లపై నడవద్దని, సంక్షేమ పథకాలు తీసుకోవద్దంటూ ఇటీవల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే భాస్కర్ రావు వ్యాఖ్యలపై స్పందించిన ఇందిరా శోభన్.. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సంక్షేమం అందించడం ప్రభుత్వ బాధ్యత కానీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అయ్య జాగిర్ అన్నట్టు మాట్లాడటం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రభుత్వ పథకాలు పొందరాదు అనడం ఏంటని మండిపడ్డారు. వెంటనే ఎమ్మెల్యే భాస్కర్ రావును బర్తరఫ్ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి కేటీఆర్‌లను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఇందిరా శోభన్ మరొక ట్వీట్‌లో త్రీఫేజ్ కరెంటు 5 నుంచి 6 గంటలే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలకు మద్దతుగా ఆమె ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 24గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లలో ఊకదంపుడు ఉపన్యాసం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో రైతులు సబ్‌స్టేషన్ ముట్టడించారని అబద్ధాలు చెప్పుడు బంద్ చేసి వాస్తవంలో బతకండి అంటూ మండిపడ్డారు.



Next Story

Most Viewed