బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకంతో మెరిసిన మియాపూర్ వాసి..

by Disha Web Desk 11 |
బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకంతో మెరిసిన మియాపూర్ వాసి..
X

దిశ, మియాపూర్: తెలంగాణ ఎలైట్ మెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మియాపూర్ కు చెందిన వ్యక్తి బంగారు పతకంతో సత్తా చాటాడు. తెలంగాణ స్టేట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఎలైట్ మెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కాగజ్ నగర్ లో ఈ నెల 24, 25వ తేదీలలో పోటీలు నిర్వహించారు. వివిధ కేటగిరిలలో రాష్ట్ర స్థాయి బాక్సర్లు 150 మంది పోటీల్లో పాల్గొనగా 13 మంది విజేతలుగా నిలిచారు. ఇందులో భాగంగా హెవీవెయిట్ క్యాటగిరిలో మియాపూర్ కు చెందిన కాకుళ్లవరుపు అనూప్ నాయుడు బంగారపు పతకాన్ని సాధించారు. ఈ పోటీల్లో ఆయన వరుసగా మూడోసారి గెలవడం విశేషం. ఇందులో గెలుపొందిన వారు హరియాణలోని హిసార్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలో పాల్గొంటారని కోచ్ బాగరి నాగరాజు తెలిపారు.



Next Story

Most Viewed