- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్లపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్.. పాల్గొన్న CM, డిప్యూటీ సీఎం
హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై తమకున్న అభ్యంతరాలను కేంద్రం ఎదుట క్లియర్గా వివరించామని.. గోదావరి వాటర్ ట్రైబ్యునల్ అవార్డుకు ఇది వ్యతిరేకమని కూడా చెప్పినట్లు గుర్తుచేశారు.
కాగా, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది.






