సీఎం రేవంత్‌ రెడ్డికి మంత్రి ఉత్తమ్‌ ఫోన్‌..!

by Disha Web Desk 5 |
సీఎం రేవంత్‌ రెడ్డికి మంత్రి ఉత్తమ్‌ ఫోన్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: దావోస్, లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఫోన్ చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) వ్యవహారంపై సీఎంతో మంత్రి చర్చించినట్లు సమాచారం. గతంలో కేఆర్‌ఎంబీ, ప్రభుత్వం మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు బయటపెట్టాలని సీఎం మంత్రికి సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఛాంబర్‌లో ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

Next Story