ఎమ్మెల్యేగా గెలవలేకపోయాం.. ఎంపీ సీటు గెలిచి తీరాలి: మంత్రి తుమ్మల

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యేగా గెలవలేకపోయాం.. ఎంపీ సీటు గెలిచి తీరాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని మళ్ళీ మనమే గెలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లు ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నేతలతో మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టడ్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయాలపై చర్చించారు. అన్ని విధాలుగా తన పూర్తి సహకారం ఉంటుందని తుమ్మల హామీ ఇచ్చారు. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని, అందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed