‘BRS నేతలు పనికిరాని చాలెంజ్‌లు విసురుతున్నారు’

by Disha Web Desk 2 |
‘BRS నేతలు పనికిరాని చాలెంజ్‌లు విసురుతున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ విరిసిన చాలెంజ్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. గురువారం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారని.. దానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ నేతలు పనికిరాని చాలెంజ్‌లు విసురుతున్నారని మండిపడ్డారు. మల్కాజ్‌గిరిలో కేటీఆర్ పోటీ చేస్తే ఓడించి ఇంటికి పంపుతామని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆరే కాదు.. కేసీఆర్‌ పోటీ చేసినా మల్కాజ్‌గిరిలో ఈ సారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు. దమ్ముంటే మా చాలెంజ్‌ను స్వీకరించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు ఉతికి ఆరేశారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇంటికి పంపిన వాళ్లతో మాకు పోటీ ఏంటి అని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed