వలసదారుల, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-19 17:24:25  IST  )

రాష్ట్రంలోని వలసదారులు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి జీవనోపాధి కోసం మొబైల్ వలస సహాయ కేంద్రం ప్రారంభించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శ

వలసదారుల, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వలసదారులు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి జీవనోపాధి కోసం మొబైల్ వలస సహాయ కేంద్రం ప్రారంభించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ, ఎప్​ఏఓ సంయుక్త కార్యచరణగా రూపొందించబడిందని చెప్పారు. ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం నిజామాబాద్ ,నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్లుతున్న గ్రామీణ కుటుంబాలకు వలసకు ముందు, వలస సమయంలో తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు సేవలు అందిస్తామన్నారు.

ఈ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి, ఎంపికచేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరిక్షలు, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై, పశుపాలనపైన వర్చువల్ శిక్షణలు ఇవ్వాలని సూచించారు. ఇకపై ఈ వాహనాల ద్వారా మొబైల్ మట్టి నమూనా పరీక్షలు, పశుసేవల వంటి ఇతర సేవలు కూడా రైతులకు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. యుఎన్​భాగస్వామ్య సంస్థల కృషిని ప్రశంసించారు. వలస వెళ్ళిన కుటుంబాలలో మహిళలు తరచూ ఇంటిలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. అటువంటి మహిళలకు గ్రామాల్లోనే సేవలు అందించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుంది. ఇది వారిని శక్తివంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ, ఎఫ్​ఏఓకు చెందిన అగ్రిబిజినెస్ స్పెషలిస్ట్ జగన్మోహన్ రెడ్డి, ఐఎంఓ రాష్ట్ర సమన్వయకర్త జలజ తదితరులు పాల్గొన్నారు.

Next Story