రాజగోపాల్ రెడ్డిపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
రాజగోపాల్ రెడ్డిపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి చేసిందేమీ లేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక సృష్టించాడని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉండి కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదని వ్యాఖ్యానించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కూసుకుంట్ల గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed