హైదరాబాద్‌లో అలర్లకు కుట్ర.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
హైదరాబాద్‌లో అలర్లకు కుట్ర.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ లీడర్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని, కొందరు కావాలనే హైదరాబాద్ నగరంలో కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎవరి దేవుళ్లను వారు పూజిస్తారని, ఇతరుల దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. హైదరాబాద్ మహా నగరంలో అన్ని మతాల వారు నివసిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రెండ్రోజులుగా జరుగుతున్న ఘటనలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో అలర్లకు కుట్ర జరుగుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



Next Story

Most Viewed