మన్యం వీరుడు అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 19 |
మన్యం వీరుడు అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారం ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి వర్ధంతిని పురస్కరించుకొని రూపొందించిన ఆడియో గీతాన్ని ఆయన ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అల్లూరి 125వ జయంతిని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని కేటాయించామన్నారు. రాష్ట్రాలు వేరైనా ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, క్షత్రియ సేవా సమితి తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు రఘురామరాజు, సెక్రటరీ ప్రదీప్ వర్మ, జాయింట్ సెక్రటరీ నాని రాజు తదితరులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed