వరంగల్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త

by Disha Web Desk 2 |
వరంగల్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లా ప్రజలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. ఆదివారం మాట్లాడుతూ.. ఎమ్ఎస్ఎమ్ఈల కోసం నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి నైపుణ్య వర్సిటీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ద్వితీయ శ్రేణి నగరంగా పేరొందిన వరంగల్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Next Story

Most Viewed