- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మంత్రి సీతక్క
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇవాళ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఎన్ఎస్యూఐ (NSUI) నాయకులతో కలిసి సీతక్క కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్స అందించాలని, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వారు ఆసుపత్రుల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ (CMRF) నుంచి చెల్లించాలని గతంలో సీతక్క కోరారు. అయితే, లాక్డౌన్ ఉన్నా ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేసి కరోనాను మరింత వ్యాప్తి చేస్తున్నారని అప్పటి కేసీఆర్ సర్కార్ ఆమెతో పాటు అప్పటి ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్పై కేసు నమోదు చేసింది.






