- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Seethakka: హాస్టల్ జీవితం అద్భుతంగా ఉంటుంది.. నేను కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నా

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యకు మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని పీఆర్, ఆర్డీ శాఖ మంత్రి సీతక్క గురువారం అన్నారు. గురువారం గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బందితో కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి విద్యా ఏడాది ఇలాంటి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గురుకులాల్లో పదేళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. పిల్లల ఈ దేశ భవిష్యత్తు.. వారి భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతుందని దేశ మొదటి ప్రధాని నెహ్రు చెప్పారన్నారు. ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉందన్నారు. కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్టు భ్రమలు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
హాస్టల్ జీవితం చాలా అద్భుతమని.. నేను ములుగులో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో నాలుగు నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాని తెలిపారు. నేను నిత్య విద్యార్థిని.. LLb, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పూర్తి చేశానని చెప్పారు. మరో పీజీ కోర్సు చేసేందుకు సిద్ధమవుతున్నాని చెప్పారు. హస్టల్ జీవితం ఆనందదాయకమైందని, హస్టల్లో అందించే పుడ్ సొంత కుటుంబాన్ని గుర్తు చేయాలన్నారు. విద్యార్థులను సంరక్షించేందుకు ప్రభుత్వం నుంచి మీరు వేతనాలు అందుకుంటున్నారని తెలిపారు. పిల్లలను ప్రయోజకులను చేయడం మీ మీద ఉంది.పరీక్షల్లో మంచి ఫలితాలను ఇవ్వగలిగారన్నారు. కొన్ని చోట్ల కలుషిత ఆహార ఘటనలు వెలుగుచూస్తున్నాయని, కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు దురదృష్టకర ఘటనల మీద రాజకీయం చేస్తున్నాయన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పులు సోషల్ మీడియాలో పెట్టి విష ప్రచారం చేస్తున్నారన్నారు. మెస్ చార్జీలను పెంచామనిర గుర్తు చేశారు. మెను ను పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మా ప్రభుత్వం టీచర్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. అత్యున్నత విద్యా వ్యవస్థను పెంపొందించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
ఐఏఎస్లో గురుకులాల్లో నిద్ర చేసేలా చర్యలు
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.మీరు విద్యను పంచడం ద్వారా లక్షలమంది ప్రయోజకులై ఈ దేశ నిర్మాణంలో భాగం పంచుకుంటారన్నారు. ఏఎఎస్ లు గురుకులాల్లో నిద్ర చేసేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.పేరెంట్స్ తర్వాత ప్రిన్సిపాల్స్ పిల్లల బాధ్యత తీసుకోవాలన్నారు. మానవత్వాన్ని మేలవించి బోధిస్తే విద్యార్థులు సక్సెస్ అవుతారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకు విద్యా హక్కును ప్రసాదించారన్నారు. బయట లక్షలు పెట్టిన కొనలేని విద్యను గురుకులాల్లో మన ప్రభుత్వ అందిస్తుంది.మీ విద్యార్థుల విజయాలే మీ పని తీరుకు అద్దం పడుతుంది . టీచర్ల ప్రభావం విద్యార్థుల మీద అధికంగా ఉంటుందన్నారు. హాస్టల్లో చదివి ఎదిగిన బిడ్డనైనందున గురుకుల హాస్టల్ లపై నాకు ప్రత్యేక మమకారం ఉందన్నారు.సీఎం ఆదేశానుసారం హాస్టలను సందర్శిస్తున్నాను .ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు పదోన్నతులు పూర్తి చేశామని తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డే గా ప్రకటించి మహిళా టీచర్ల గౌరవాన్ని పెంచాము. మహిళా టీచర్ల విజ్ఞప్తిని సీఎం గారికి నివేదిస్తే.. వెను వెంటనే జీవో జారీ చేశారని గుర్తు చేశారు.
గురుకుల టీచర్లు, ప్రిన్సిపల్ల ఒత్తిడి నాకు తెలుసు: మంత్రి సీతక్క
గురుకులాల టీచర్లు, ప్రిన్సిపల్స్ ఒత్తిడి తనకు తెలుసునని మంత్రి సీతక్క అన్నారు. రాజకీయ కారణాలతో చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. దండనతో కాకుండా ఆప్యాయతగ పిల్లలతో మెలగాలి పేదింటి బిడ్డలను విజయపథంలో నిలపాల్సిన బాధ్యత మీదేనని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ అవమానాలను అధిగమించి ఐకాన్ అఫ్ నాలెడ్జిగా ఎదిగారని, ఆయననన స్పూర్తిగా తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో మన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీచర్లతో విద్యార్థుల కాళ్లు మొక్కించడం ఏం సంస్కృతి . ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఉపాధ్యాయులు అంతా ఏకమై ఖండించాలన్నారు.
కలుషిత ఆహార ఘటనలపై ప్రభుత్వ సీరియస్
కలుషిత ఆహారఘనటలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రభుత్వంలో టీచర్లు కూడా భాగస్వాములేన్నారు. జ్ఞానం అనేది తరగని గని తెలిసింది కొంతేనని, తెల్సుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. విద్యార్థులను వజ్రాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లదేన్నారు. .గురుకులల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పిల్లల జీవితాలతో చెలగాటలొద్దన్నారు. అనంతరం సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను మంత్రి సీతక్క విడుదల చేశారు. మంత్రి సీతక్కను గురుకులాల సిబ్బంది శాలువాతో సన్మానించారు.