అత్యంత కీలకమైన సమావేశానికి మంత్రి సబితా డుమ్మా!

by Disha Web Desk 2 |
అత్యంత కీలకమైన సమావేశానికి మంత్రి సబితా డుమ్మా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కీలక సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డుమ్మా కొట్టారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ అధ్యక్షతనే ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్, బోర్డు అధికారులు, కాలేజీల యాజమాన్యాలు బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఇటీవల సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమీక్షలో చర్చించారు.

మొత్తం 14 కార్పొరేట్ కాలేజీలకు అధికారులు ఆహ్వానం పంపించగా అత్యంత కీలకమైన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే మరో వైపు కీలక సమావేశానికి సబితా గైర్హాజరు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. అయితే ముందుగా అనుకున్న జిల్లా పరిషత్ సమావేశం ఆలస్యం కావడం వల్లే ఈ మీటింగ్‌కు మంత్రి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story