TS: హిందీ పేపర్ లీక్‌పై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 2 |
TS: హిందీ పేపర్ లీక్‌పై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: టెన్త్ హిందీ ప‌రీక్ష ప్రశ్నాప‌త్రం వాట్సాప్‌ల్లో చ‌క్కర్లు కొడుతుండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది. ప‌రీక్ష ప్రారంభ‌మైన కొద్ది నిముషాల్లోనే హిందీ ప‌రీక్ష ప్రశ్నా ప్రతాలు సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు షాక‌య్యారు. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని వరంగల్‌, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. నిజాలు తేల్చేందుకు వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేయాలని డీఈవోలను మంత్రి సబిత ఆదేశించారు.

Next Story

Most Viewed