9 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

by Disha Web Desk 6 |
9 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 9 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ ఎల్బీనగర్ లో లో ప్రారంభించారు. లహరి సర్వీస్ పేరుతో ఈ బస్సులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నడపనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టామని, వాటిలో ఇప్పటికే 400 పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed