ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ.. మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ.. మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతామన్నారు. ఉగాది తర్వాత నూకెవరు ? పొట్టు ఎవరు అనేది తేలుస్తామన్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ప్రజలకు నూకలు తినిపించి చూడాలని, లేదా పీయూష్ గోయల్ తో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యను అర్ద్రతతో కూడిన హృదయంతో చూడాలన్నారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని భావిస్తే అది శునకానందమే అవుతుందని పువ్వాడ తెలిపారు.



Next Story

Most Viewed