ఉద్యోగులకు మంత్రి పొంగులేటి వార్నింగ్!

by Disha Web Desk 14 |
ఉద్యోగులకు మంత్రి పొంగులేటి వార్నింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమయపాలన పాటించని ఉద్యోగులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలు దాటిన కూడా ఉద్యోగులు సచివాలయానికి హాజరుకాలేదని మంత్రి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ అధికారులతో తెప్పించి వారి హాజరు లిస్ట్ మంత్రి పరిశీలించారు. దీంతో సమయానికి కార్యాలయానికి రాని ప్రభుత్వ ఉద్యోగులపై, సమాచారం లేకుండా ఆఫీస్‌కి రాని ఉద్యోగులపై మంత్రి సీరియస్ అయ్యారు.

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఉద్యోగులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని మంత్రి సీరియస్ అయ్యారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.



Next Story

Most Viewed