KTR : 22 ఏళ్ల క్రితం మంత్రి కేటీఆర్ ఎలా ఉన్నాడో తెలుసా?

by Disha Web Desk 2 |
KTR : 22 ఏళ్ల క్రితం మంత్రి కేటీఆర్ ఎలా ఉన్నాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నారు. లండన్‌లో జరిగిన ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించే ల‌క్ష్యంతో వరుసగా ఆయా దేశాల పారిశ్రామిక‌వేత్తలు, వాణిజ్య సంఘాల‌తో భేటీలు జరుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబ‌డుల అనుకూల‌త‌ల గురించి కేటీఆర్ వారికి వివరిస్తున్నారు. ఈనెల 13వ తేదీ వ‌ర‌కు కేటీఆర్ యూకేలో ప‌ర్యటించ‌నున్నారు. అయితే, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అనంతరం కేటీఆర్ సరదాగా లండన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. 22 ఏళ్ల క్రితం లండన్ నగరంలోని ఓ టెలిఫోన్ బూత్‌లో నిల్చొని ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దానిని బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు షేర్ చేస్తున్నారు.


Also Read..

Sesame Oil: ఈ నూనె వలన మహిళలకు ఎన్ని ఉపయోగాలో తెలుసా?


Next Story

Most Viewed