తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగరేశాం: కేటీఆర్

by Disha Web Desk 2 |
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగరేశాం: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ జలదృశ్యంలో స్వాతంత్ర సమరయోధుడు, తొలి, మలి తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed