మరి ఇప్పుడు ఈసీఐ, ఈడీ, ఐటీ ఏమయ్యాయి?: మంత్రి కేటీఆర్

by Dishafeatures2 |
మరి ఇప్పుడు ఈసీఐ, ఈడీ, ఐటీ ఏమయ్యాయి?: మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభతుత్వంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మునుగోడు బై పోల్ లో బీజేపీ రూ.100 కోట్లు ఖర్చు పెట్టిందని సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే చెప్పారని మంత్రి అన్నారు. మరి ఇప్పుడు ఈసీఐ, ఈడీ, ఐటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీకి నోటీసులు పంపి విచారణ చేసే దమ్ము ఉందా అని ఆయా విచారణ సంస్థలను నిలదీశారు. ప్రధాని మోడీ అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు. ఈ సందర్భంగా నాయిని అనురాగ్ రెడ్డి అనే వ్యక్తి షేర్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed