హిండెన్ బర్గ్‌పై ఈడీ దాడులు ఉంటాయా?: KTR

by Disha Web Desk 2 |
హిండెన్ బర్గ్‌పై ఈడీ దాడులు ఉంటాయా?: KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీబీసీ కార్యాలయంపై ఐటీశాఖ దాడులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా 'వాట్ ఏ సర్ ప్రైజ్' అని సెటైర్ వేశారు. ప్రధాని మోడీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఐటీదాడులు జరిగాయన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు న‌వ్వులపాలు అవుతున్నాయ‌ని, బీజేపీకి పెద్ద కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. వాట్ నెక్స్ట్ అని పేర్కొన్నారు. హిండెన్ బర్గ్‌పై ఈడీ దాడులు ఉంటాయా? అని ప్రశ్నించారు. లేదంటే ఆ సంస్థనే టేకోవ‌ర్ చేసుకుంటారా? అని ఆయ‌న విమ‌ర్శించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు కేంద్రం చెప్పినట్లు చేయడం హాస్యాస్పదం అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖ‌రిని ప్రశ్నించిన కేటీఆర్, త‌ర్వాత ఎటువంటి చ‌ర్యను తీసుకుంటారో చెప్పాలన్నారు.



Next Story

Most Viewed