అప్పుడే ఎన్నికలకు వెళ్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్

by Disha Web Desk 2 |
అప్పుడే ఎన్నికలకు వెళ్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు అన్నీ పూర్తయ్యాయని అన్నారు. కేవలం మూడు మాత్రమే చివరి దశలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్‌లో మూడు ఫ్లైఓవర్లు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. అంతేగాక, నాగోల్ మెట్రోను ఎల్బీనగర్‌కు జోడిస్తామని అన్నారు. హయత్‌నగర్ వరకూ మెట్రోను విస్తరిస్తామని మరోసారి ప్రకటించారు. ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని అన్నారు.


Next Story

Most Viewed