పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలి.. మంత్రి కేటీఆర్

by Dishafeatures2 |
పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలి.. మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ పీవీ నర్సింహారావు 102 జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి ఇప్పటివరకు పని చేసిన ప్రధానుల్లో పీవీ నర్సింహారావు అత్యంత సమర్థుడు అని చెప్పారు.

అలాంటి గొప్ప వ్యక్తి దేశానికి చేసిన సేవలను ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ మీడియా ఆయనను ఘోరంగా అవమానించాయని అన్నారు. ఆయన చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించేలా వ్యవహరించిందని ఆరోపించారు.

Next Story

Most Viewed