- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముగ్గురు మంత్రులు.. మూడు మాటలు : కేటీఆర్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై ముగ్గురు కేంద్ర కెబినెట్ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీజీ మీ మంత్రులకు కనీసం అబద్దాలు, బూటకాలను నిలబెట్టడానికి ఓకేలా ట్రైనింగ్ ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు చేసిన ట్వీట్లను షేర్ చేశారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు 9 మంజూరయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పగా, మన్సుఖ్ మాండవీయ జీరో ప్రతిపాదనలు అందాయని వ్యాఖ్యానించగా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రతిపాదనలు అందాయంటూ ఒక్కో మంత్రి ఒక్కో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కేంద్ర మంత్రివర్గంలో రత్నం మన స్వంత కిషన్ రెడ్డి గారు అంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణలో 9 నాన్-ఎగ్జిస్టెంట్ మెడికల్ కాలేజీలను గాలిలో లేకుండా, హైదరాబాద్లో కల్పిత గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారని కేటీఆర్ విమర్శలు చేశారు.