ఇంకా ఎన్ని ఫేక్ ముచ్చట్లు చెప్తారు సార్.. నడ్డాపై కేటీఆర్ ఫైర్

by Disha Web Desk 2 |
ఇంకా ఎన్ని ఫేక్ ముచ్చట్లు చెప్తారు సార్.. నడ్డాపై కేటీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం కర్ణాటకలోని ఉడుపిలో జరిగన ఓ కార్యక్రమంలో మోడీని ప్రశంసిస్తూ రష్యా, ఉక్రెయిన్ వార్ ప్రధాని మోడీ ఆపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదాన్ని కూడా ప్రధాని మోడీ పరిష్కరించలేకపోయారు.. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ ఆపారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా తప్పుడు ప్రచారం చేస్తున్నారు! అంటూ మండిపడ్డారు. అంతేకాదు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారనేది అవాస్తవమని వారి నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే వెల్లడించిందని గుర్తు చేశారు. 'ఇంకా ఎన్ని అబద్దాలు చెబుతారు సార్‌' అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.


Next Story