MLA సాయన్న మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 19 |
MLA సాయన్న మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు: మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల మంత్రి కేటీఆర్, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రవిచంద్ర, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. ఎమ్మెల్యేగా సాయన్న ప్రజలకు ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాయన్న పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్ల తెలిపారు.

ఇక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం చాలా బాధాకరం అని.. సాయన్న మృతి పట్ల రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. సాయన్నతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పద్మారావు గౌడ్ కోరుకున్నారు.

Also Read...

బిగ్ న్యూస్: తారకరత్న ఎప్పుడో చనిపోయాడు.. లక్ష్మీ పార్వతీ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed