ఆ ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంత్రి కొండా సురేఖ

by Disha Web Desk 2 |
ఆ ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అటవీశాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆమెకు అటవీశాఖ పథకాలు, పనులపై సంరక్షణ అధికారి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఫారెస్ట్‌లో జంతువుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తొలి సమీక్షలో పరిహారం పెంపుపై మంత్రి సంతకం చేశారు. పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెచ్చేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు. అటవీ, దేవాదాయ శాఖలో ఖాళీల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.



Next Story

Most Viewed