కష్టపడ్డొళ్లందరికీ పదవులు వస్తయ్: మంత్రి కొండా సురేఖ

by Disha Web Desk 2 |
కష్టపడ్డొళ్లందరికీ పదవులు వస్తయ్: మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. త్వరలోనే మహిళలందరికీ పదవులు వస్తాయని తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయానికి మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో ఫైట్ చేయాలన్నారు. ప్రతి గడప టచ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. కష్టపడొళ్లందరికీ నామినేటెడ్ పదవులు లభిస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం పద్మ, సదాలక్ష్మి దుర్గారాణి తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed