భూమి, ఆకాశం ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటుంది: కోమటిరెడ్డి

by Disha Web Desk 9 |
భూమి, ఆకాశం ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటుంది: కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏది ఏమైనా సరే 14 పార్లమెంట్ సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. రెండు మూడు సీట్లు బీజేపీకి వెళ్లినా, బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని కోమటిరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను నాశనం చేసి ఇవాళ కరువులో నెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ ముగిసిపోయిందని వెల్లడించారు. కరెంట్ ఇస్తానన్నారు, నీళ్లన్నారు ఇలా లక్ష చెప్పాడని అని అన్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్న రానున్న 10, 20 ఏళ్లు కాదు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed