MP టికెట్ల కేటాయింపుపై మంత్రి కోమటి‌రెడ్డి ఎమోషనల్.. సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
MP టికెట్ల కేటాయింపుపై మంత్రి కోమటి‌రెడ్డి ఎమోషనల్.. సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో మరోసారి ఢిల్లీ వెళ్లి సీఈసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ల విషయంలో తాను కలుగజేసుకోనని అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్లు కేటాయిస్తుందో వారి గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తప్ప.. ఏనాడు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రశ్నించగా.. కేసీఆర్ ఇన్నాళ్లు చేసిన పాపాలే ఆయనను చుట్టుముట్టాయంటూ కామెంట్ చేశారు.


Next Story