ఏడాదిలో తెలంగాణ భవన్ నిర్మాణం : మంత్రి కోమటిరెడ్డి

by Disha Web Desk |
ఏడాదిలో తెలంగాణ భవన్ నిర్మాణం : మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం దానిపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల వివరాలను, తెలంగాణకు రావాల్సిన వాటాను మ్యాప్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఉమ్మడి ఏపీ భవన్‌లోని పలు బ్లాక్‌లను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన 19 ఎకరాలను పరిశీలించామన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందని ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం లేదన్నారు. 58:42 రేషియోలో పంపకాలు ఉంటాయన్నారు. డిజైన్లు, ఖరారు చేసి టెండర్లు పిలిచి ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని హైదరాబాద్ వెళ్లాక సీఎంతో చర్చిస్తానన్నారు.

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి:

ఢిల్లీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏపీ ప్రత్యేక హోదా జేఏసీ సభ్యులు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా సహకరించాలని వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన కోమటిరెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చెప్పారని గుర్తు చేశారు. హోదా హామీని అమలు చేయాల్సిన బాధ్యత మోడీపై ఉందన్నారు.

Next Story

Most Viewed