కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌‌కు కిషన్ రెడ్డి లేఖ

by Disha Web Desk 2 |
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌‌కు కిషన్ రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతుగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇకపైనా ఈ సహాయాన్ని కొనసాగిస్తూ ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (పార్ బాయిల్డ్ రైస్) సేకరించాలని ఆదివారం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన లేఖ రాశారు. 2015-16 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 5.35 లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వ ధాన్య సేకరణ ద్వారా లబ్ధి పొందారని, గత సీజన్‌లో 20 లక్షల మంది తెలంగాణ రైతులు లబ్ధిపొందారని కిషన్ రెడ్డి ఆ లేఖలో గుర్తుచేశారు. తెలంగాణ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో రాష్ట్రం నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఉపక్రమించాలని పీయూష్ గోయల్‌ను కిషన్ రెడ్డి కోరారు.

Also Read..

సారీ.. మరోసారి జరగకుండా చూసుకుంటా.. బండి సంజయ్ అరెస్టుపై కరీంనగర్ సీపీ



Next Story