బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకం చూస్తున్నాం: మంత్రి

by Disha Web Desk 2 |
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకం చూస్తున్నాం: మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. కానీ, మేము ఎవరికీ చెప్పుకోలేదన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. కేంద్రం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే మన రాష్ట్రానికి 8 అవార్డులు వచ్చాయని అన్నారు. 25 ఏళ్లుగా మోడీ నాయకత్వంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకం చూస్తున్నామన్నారు. దేశంలో కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ మాట స్వయంగా మోడీ ఎన్నికల్లో మాట్లాడారు. మరి, ఇప్పటివరకు ఎంతమందికి కేంద్రం ఉపాధి కల్పించిందో చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో లక్ష 32వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము. కానీ, మేము ఎవరికి చెప్పుకోలేదన్నారు. మీరు పరిపాలన చేస్తున్న మహారాష్ట్ర, గుజరాత్‌లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూపిస్తారా..? బీజేపీ ప్రభుత్వం యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Next Story

Most Viewed