సీట్లో కూర్చున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. తొలి సంతకం దానిపైనే!

by Disha Web Desk 4 |
సీట్లో కూర్చున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. తొలి సంతకం దానిపైనే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : డాక్టర్. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని నాల్గవ అంతస్తులోని తన ఛాంబర్ లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సీట్లో కూర్చున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైల్ పై ఆయన సంతకం చేశారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర ఘట్టంలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో గర్వ కారణంగా వుందన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిర్మించారని అభివర్ణించారు. ఈ శుభ సందర్బంగా యావత్ తెలంగాణ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరిని మంత్రి అభినందించారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ నిర్వచించారు. వేద పండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వేద మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.



Next Story

Most Viewed