Telangana Budget 2023: మధ్యాహ్న భోజన కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

by Disha Web Desk 19 |
Telangana Budget 2023: మధ్యాహ్న భోజన కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు మధ్యాహ్న భోజన కార్మికులకు గుడ్ న్యూ్స్ చెప్పారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. అంతేకాకుండా ఏప్రిల్ నుండి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపడతామని తెలిపారు. దీనితో పాటుగా సెర్ప్ ఉద్యోగులకు ఏప్రిల్ నుండి పే స్కేలు సవరణ చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానం అమలు చేస్తామని.. ఇందుకోసం ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


Next Story

Most Viewed