'గుజరాత్ మొత్తం కేసీఆర్ ఫొటో పెట్టాలి'

by Disha Web Desk 2 |
గుజరాత్ మొత్తం కేసీఆర్ ఫొటో పెట్టాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫొటోలే పెట్టాల్సి వస్తే గుజరాత్ అంతా కేసీఆర్ ఫొటో పెట్టాలని మంత్రి గుల కమలాకర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన అనంతరం అసెంబ్లీ లాబీలో మంత్రి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. దేశానికి అత్యధికంగా జీఎస్టీ కట్టేది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. అదానీకి పెట్టిన డబ్బులన్నీ తెలంగాణ ప్రజల రక్తమని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు వివరాలు కావాలంటే సీఎస్‌తో రివ్యూ చేయాలన్నారు. రేషన్ షాపునకు కేంద్రమంత్రి నిర్మల డైరెక్ట్‌గా వెళ్ళడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని మంత్రి గంగుల విమర్శించారు. రేషన్ షాపుల దగ్గర ప్రధాని ఫొటో పెట్టాలనే రూల్ ఏమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి సహకరించకుండా అడ్డుకుంటుందని మంత్రి ఆరోపించారు.

Next Story

Most Viewed