- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అజారుద్దీన్
by Taduka Kalyani |
ఈ నెల 8వ తేదీన ప్రారంభం కానున్న సాంప్రదాయ చేప మందు (ప్రసాదం) పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ శుక్రవారం పరిశీలించారు

X
దిశ, కార్వాన్ : ఈ నెల 8వ తేదీన ప్రారంభం కానున్న సాంప్రదాయ చేప మందు (ప్రసాదం) పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ శుక్రవారం పరిశీలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ పనులను తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రతి ఏటా బత్తిని సోదరులు భక్తులకు అందించే ఈ చేప ప్రసాదం పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ అధికారులతో కలిసి గ్రౌండ్లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్కు తరలివస్తారని,ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు.
Next Story






