- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నామలై ఎఫెక్ట్.. బీజేపీకి గుడ్బై చెబుతున్న తమిళ నేతలు
తమిళనాడులో బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు సీనియర్ నేతలు కూడా బీజేపీని వీడారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు సీనియర్ నేతలు కూడా బీజేపీని వీడారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించగా, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ కూడా పార్టీకి గుడ్బై చెప్పారు. అన్నామలైకి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నానని నాగరాజన్ తెలిపారు. ఆయన చెన్నై విమానాశ్రయంలో అన్నామలైకి స్వాగతం పలికారు. తమిళనాడులో బీజేపీ తరఫున టీవీ చర్చల్లో తరచూ కనిపించే నాగరాజన్, 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2017 ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు.
అన్నామలై కొత్త ఉద్యమం..
ఇక అన్నామలై శుక్రవారం బీజేపీకి రాజీనామా చేస్తూ ‘అన్నామలై మక్కల్ ఇయ్యక్కం (AMI)’ పేరుతో కొత్త ఉద్యమాన్ని ప్రకటించారు. ఇది భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారి 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. తమిళనాడులో ‘కల్ట్ రాజకీయాలకు’ బదులుగా సామాన్యుల రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 2026 తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై పార్టీ నాయకత్వంతో విభేదాలు రావడంతో అన్నామలై అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాతో తమిళనాడులో బీజేపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.






