రాగి ఆకుపై ‘దిశ’ ఆవిష్కరణ

by Disha Web Desk |
రాగి ఆకుపై ‘దిశ’ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు మీడియా రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన ‘దిశ’ దినపత్రిక నేటితో నాలుగు వసంతాలను పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా గురువారం (మార్చి 7) నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రెట్ చేసుకుంది. ఈ క్రమంలో ‘దిశ’కు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖుల నుంచి శుభాక్షాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన సూక్ష్మకళాకారుడు పూన ప్రదీప్ కుమార్ ‘దిశ’పై అన అభిమానాన్ని చాటుకున్నాడు. తన ప్రతిభతో రాగి ఆకుపై ‘దిశ’ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపాడు. తను నాలుగేళ్లుగా దిశ పాఠకుడినని తెలిపారు. ఏ పార్టీకి వంతపాడకుండా, ఏ నాయకుడి చంకలో చేరకుండా నిజాలను నిక్కచ్చిగా అందిస్తూ మా గుండెల్లో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు.

Next Story