ప్రయాణికులకు మెట్రో మరో షాక్.. ఇకపై దానికి డబ్బులు కట్టాల్సిందే!

by Disha Web Desk 19 |
ప్రయాణికులకు మెట్రో మరో షాక్.. ఇకపై దానికి డబ్బులు కట్టాల్సిందే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే మెట్రో ప్రయాణ ఛార్జీల రాయితీల్లో కోత విధించిన ఎల్ అండ్ టీ సంస్థ.. తాజాగా మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్‌కు చార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించేందుకు ప్రయాణికుల వద్ద నుంచి ఎటువంటి ఛార్జీ వసూలు చేయడం లేదు.

కానీ ఇకపై వాటికి డబ్బులు వసూలు చేసే చేయాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో అన్ని స్టేషన్లలో టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి వాటిని ఉపయోగించుకునే ప్రయాణికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయాలనే నిర్ణయింది. ఇప్పటికే ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రాజెక్టును లాభదాయకంగా మార్చేందుకు ఎల్ అండ్ టీ వేగంగా అడుగులు వేస్తుండగా తాజా నిర్ణయం ప్రయాణికులను షాక్‌కు గురి చేస్తోంది.


Next Story