20 వాహనాల కాన్వాయ్‌తో స్టేడియంకు మెస్సి.. భద్రత కట్టుదిట్టం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-13 12:13:41  IST  )

సాకర్ స్టార్ లియోనెల్ మెస్సి (Lionel Messi) శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు.

20 వాహనాల కాన్వాయ్‌తో స్టేడియంకు మెస్సి.. భద్రత కట్టుదిట్టం
X

దిశ, వెబ్‌డెస్క్: సాకర్ స్టార్ లియోనెల్ మెస్సి (Lionel Messi) శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం కొనసాగుతోంది. అనంతరం 250 మందితో ఫొటో సెషన్‌ ముగియగానే రాత్రి 7.05కు లియోనెల్ మెస్సి ఉప్పల్ స్టేడియంకు 20 వాహనాల కాన్వాయ్‌తో బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో మోస్సి వెళ్లే రూట్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాత్రి 8.06కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని గ్రౌండ్‌లోకి ఎంటర్ అవుతారు. 8.07కు మెస్సీ ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్‌ సువారెజ్‌లు గ్రౌండ్‌లోకి అడుగుపెడతారు. అనంతరం వారితో 5 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడి సందడి చేయనున్నారు.

Next Story