వెంకయ్యనాయుడిని కలిసిన చిరంజీవి.. పరస్పరం శుభాకాంక్షలు

by Disha Web Desk 2 |
వెంకయ్యనాయుడిని కలిసిన చిరంజీవి.. పరస్పరం శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. పద్మ విభూషన్ పురస్కారం రావడంతో స్వయంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు కూడా చిరంజీవికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సన్మానాలకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం రావడంపై సినీ ప్రముఖులు, తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌బాబు, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్, రవితేజ, దర్శకులు కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, సుకుమార్‌, గుణశేఖర్‌, కె.ఎస్‌.రవీంద్ర, గోపీచంద్‌ మలినేని, మారుతి, ప్రశాంత్ వర్మ తదితరులు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.



Next Story

Most Viewed