తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్‌ మార్క్.. తనదైన శైలిలో ప్రాబ్లమ్స్ సాల్వ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-08 02:03:42  IST  )

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్‌ మార్క్.. తనదైన శైలిలో ప్రాబ్లమ్స్ సాల్వ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ బలోపేతంపై ఆమె దృష్టి సారించారు. ఈ క్రమంలో పార్టీలోని పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించి, వారిని సెట్ చేసేందుకు మంత్రులు, కీలక లీడర్లకు ఆదేశాలిచ్చారు. పటాన్‌​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌​రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్​‌గౌడ్‌ మధ్య ఉన్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విప్ ​ఆది శ్రీనివాస్​‌ రంగంలోకి దిగారు.

పార్టీ పరిస్థితులపై అభిప్రాయ సేకరణ

కొద్దిరోజులుగా గూడెం, కాటా మధ్య వివాదం నెలకొన్నది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌‌లో చేరిన మహిపాల్‌​రెడ్డి నియోజకవర్గంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నారని, ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్న లీడర్లను పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలు రొడ్డెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఎమ్మెల్యేకు షోకాజ్​‌నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి, సమస్య పరిష్కరించాలని పార్టీ కమిటీని ఆదేశించింది. ఈ విషయంలో ఎమ్మెల్యే మహిపాల్‌​రెడ్డి, ఇ‌న్‌చార్జి శ్రీనివాస్‌​గౌడ్‌‌లను గాంధీ భవన్‌‌కు పిలిచి ఇరువురి అభిప్రాయాలను సేకరించారు. శుక్రవారం ఇదే విషయమై మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​‌సమావేశమయ్యారు.

పటాన్‌​చెరు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఘటనపై చర్చించారు. గూడెం, కాటా ఇష్యూపై చర్చించినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళితే బాగుంటుందని మంత్రి అభిప్రాయాన్ని శ్రీనివాస్‌ తీసుకున్నారు. పటాన్‌చెరు కాంగ్రెస్‌​లో నెలకొన్న పరిస్థితులపై ఇప్పటి వరకు సేకరించిన అభిప్రాయాలు, ఇతర అంశాలన్నింటినీ అధిష్ఠానానికి త్వరలోనే నివేదిస్తామని ఆది శ్రీనివాస్​తెలిపారు. దాదాపు నేతల మధ్య సమన్వయం కుదర్చి పార్టీ బలోపేతానికి కృషి చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story