స్థానిక ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలకం: మీనాక్షి నటరాజన్

by Ajay Maddhiboyina |

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ​వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ​అన్నారు.

స్థానిక ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలకం: మీనాక్షి నటరాజన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ​వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ​అన్నారు. ఆదివారం గాంధీ భవన్​లో రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ సమావేశం చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య​అతిథులుగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సంఘటన్ జాతీయ అధ్యక్షలు సునీల్ పన్వర్ విచ్చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సంఘటన్ కీలక బాధ్యతలు తీసుకుని పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో సంఘటన్ పునర్ వ్యవస్తీకరణ చేస్తామని సునీల్ పన్వర్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Next Story