కాంగ్రెస్ పాలనలో వైద్యరంగం పూర్తిగా నిర్లక్ష్యం: Minister Harish Rao

by Disha Web Desk 19 |
కాంగ్రెస్ పాలనలో వైద్యరంగం పూర్తిగా నిర్లక్ష్యం: Minister Harish Rao
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. రాష్ట్రం ఏర్పడిన నాటికి 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే వాటిని 2,790కు పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఏడాదిలోనే ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్‌లోనే 5 మెడికల్ కాలేజీలు వస్తాయని కలలో అయినా అనుకున్నారా? ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామని చెప్పారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని విమర్శించారు.

నాటి మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి కూడా మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి లేఖలు రాశారని, కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలు నెలకొల్పారని చెప్పారు. బీబీ నగర్ ఎయిమ్స్ పరిస్థితి దారుణంగా ఉందని ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేసే అవకాశం కల్పించాన్నారు. అన్ని జిల్లాల్లో పారామెడికల్ కోర్సులు ప్రారంభిస్తున్నామని మెడికల్, నర్సింగ్‌తో పాటు పారామెడికల్ కాలేజీలు వస్తాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడే ఎయిర్ సాంప్లార్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడుతున్నామన్న మంత్రి.. 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ నెల రోజుల్లో పూర్తి చేసి, మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా చేస్తామని చెప్పారు. ఈ ఏడాదిలోనే మెదక్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, ఫిల్మ్ నగర్ పీహెచ్‌సీ కొత్త భవనం మంజూరు చేస్తామన్నారు.


Next Story