- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు
తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీని ఏర్పాటైంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: 2025-2027 కాలానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీని (ఎంఏసీ) (Assembly Media Advisory Committee) రాష్ట్ర శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ఏర్పాటు చేశారు. ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గా, పోలోజు పరిపూర్ణాచారిని కో చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు 13 మంది సభ్యులతో కూడిన అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాసనసభ సంయుక్త కార్యదర్శి సీహెచ్. ఉపేందర్ రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో ఐతరాజు రంగరావు, బొడ్లపాటి పూర్ణచంద్రరావు, లక్కడి వెంకట్ రామ్ రెడ్డి, పోలంపల్లి ఆంజనేయులు, ఎం.పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీం వజాహత్, బసవ పున్నయ్య, ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బి. హెచ్ ఎం.కే గాంధీలను ఈ కమిటీలో మెంబర్లుగా నామినేట్ చేయబడ్డారు.






